తెలంగాణలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను ఆదిలాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దేశవ్యాప్తంగా చోరీలు చేస్తున్నారని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. వీరి నుంచి 33 తులాల బంగారం, 71 తులాల వెండి, ఒక కారు, 4 సెల్ఫోన్లు, రూ.15,500 నగదుతో పాటు దొంగతనానికి ఉపయోగించే వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.