ఆదిలాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రావణ్ నాయక్ మాట్లాడుతూ, స్వామి వివేకానంద చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 12న స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఆదిలాబాద్లోని న్యూ హౌసింగ్ బోర్డ్ చౌరస్తా వద్ద నిర్వహిస్తున్నట్లు ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమానికి డిసిసి అధ్యక్షుడు నరేష్ జాదవ్, నియోజకవర్గ ఇన్చార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి హాజరవుతారని పేర్కొన్నారు.