ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో బుధవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో శ్రీకాంత్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బేలలోని గణేష్ గార్డెన్ ఎదుట జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను రిమ్స్ కు తరలించారు.