రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ జెండా రెపరెపలాడాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ బీజేపీ కార్యాలయంలో శనివారం జరిగిన మున్సిపల్ ఎన్నికల సమీక్ష సమావేశంలో ఎంపీ గోడం నగేష్ తో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు మున్సిపల్ ఎన్నికల గెలుపు పై దిశా నిర్దేశం చేశారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో, ప్రస్తుత రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో మున్సిపల్ లో సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడి అన్న చందంగా మారిందని ఆయన అన్నారు.