గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అన్నారు. బుధవారం ఆదిలాబాద్లో సీఎం సభ ఏర్పాట్లను కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు. రెండేళ్ల ప్రజా పాలనలో ప్రభుత్వం చేసిన మంచి పనులకు గుర్తుగా ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుకుంటున్నామని ఆయన తెలిపారు.