కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ స్వలాభం కోసం సీసీఐ పరిశ్రమను తాకట్టు పెట్టి, భూ నిర్వాసితులను, ఉద్యోగులను మోసం చేస్తున్నాయని మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు. ఆదిలాబాద్ బెల్లూరిలో భూ నిర్వాసితులతో సమావేశం నిర్వహించిన ఆయన, భూములు కోల్పోయిన రైతులకు ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా అక్కడి స్క్రాప్ను తొలగించడంపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ విషయంలో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.