తెలంగాణ కాటన్ జిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ నవంబర్ 6 నుండి జిన్నింగ్ మిల్లులను నిరవధికంగా మూసివేయనున్నట్లు ప్రకటించడంతో ఆదిలాబాద్ జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో, జిల్లా కలెక్టర్ రాజర్షి షా మంగళవారం సీసీఐ, జిన్నింగ్ మిల్లుల యజమానులు, మార్కెటింగ్, వ్యవసాయ, రవాణా, అగ్నిమాపక శాఖల అధికారులతో పత్తి కొనుగోళ్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు.