మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో, ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఫెలిసిటేషన్ కేంద్రం, ఎన్నికల ప్రచార వాహనాల అనుమతుల కేంద్రాలలో ఏర్పాట్లను, రిజిస్టర్లను కలెక్టర్ రాజర్షిషా గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ పరిశీలనలో మున్సిపల్ కమిషనర్ రాజు, నోడల్ అధికారి ఫణిందర్ రావ్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్వేత, మున్సిపల్, ఎన్నికల సిబ్బందితో పాటు తదితరులు పాల్గొన్నారు.