రక్తదానం అంటే ప్రాణదానమని, రక్తదానంపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. శనివారం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ రిమ్స్ ఆడిటోరియంలో పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్తదాతలను అభినందించారు. అనంతరం దాతలకు ప్రశంస పత్రాలు అందజేశారు. ఆయనతో పాటు డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్ ఉన్నారు.