ఆదిలాబాద్ జిల్లాలో జొన్నల కొనుగోలు, రవాణా, అన్లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. గోదాముల నిర్వహణ, హమాలీల కేటాయింపులపై సమీక్ష నిర్వహించి, కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని సూచించారు.