ఆదిలాబాద్లో
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీకాంత్ రెడ్డి నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో, స్వతంత్ర భారతదేశ నిర్మాణంలో జవహర్లాల్ నెహ్రూ చేసిన అపారమైన కృషిని, త్యాగాలను గుర్తుచేసుకున్నారు.