సోమవారం ఆదిలాబాద్ పోలీసు ముఖ్య కార్యాలయంలో గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రజా ఫిర్యాదులను నేరుగా స్వీకరించారు. బాధితులకు జిల్లా పోలీస్ యంత్రాంగం అండగా ఉంటుందని, సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాధితుల సమస్యల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, సిబ్బందిని కేటాయించి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.