గిరిజన ప్రాంతాల్లో లభ్యమయ్యే సహజ వనరులను సద్వినియోగం చేసుకోవడం ద్వారానే గిరిజనుల ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. నార్నూర్ లోని నడ్డంగూడ గ్రామంలో గిరిజన కళాకారుల కోసం ఏర్పాటు చేసిన 'కళాత్మక వెదురు వస్తువుల తయారీ' శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. స్థానిక వనరులతో విభిన్నమైన ఆకర్షణీయమైన కళాఖండాలను తయారు చేయడం ద్వారా గిరిజన యువతకు స్వయం ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన తెలిపారు.