ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఉద్యోగాల పేరుతో మోసం చేసే ముఠాలను నమ్మవద్దని, డబ్బులు అడిగే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాలు డబ్బులతో రావని, కష్టపడి పరీక్షల ద్వారా సాధించాలని ఆయన తెలిపారు. నకిలీ ఉద్యోగాల పేరుతో మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పోలీసు యంత్రాంగం హెచ్చరించింది.