ఇంద్రవెల్లి మండలం శంకర్గూడా సమీపంలో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గుడిహత్నూర్ నుంచి ఇంద్రవెల్లి వెళ్తున్న బైక్ను ఆదిలాబాద్ వైపు వస్తున్న ఉట్నూర్ డిపో ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.