రైతుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని మాజీ మంత్రి జోగురామన్న ఆరోపించారు. రంగు మారిన సొయాను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ, శుక్రవారం రైతులతో కలిసి జైనథ్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కిసాన్ యాప్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, రైతుల దగ్గర నుండి పంటలను కొనుగోలు చేసేంత వరకు బిఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.