ఆదిలాబాద్ జిల్లా, ఆదిలాబాద్ లోని శ్యాంపూర్ గ్రామంలో ఇంకర్ గూడ వద్ద చేతి పంపు పైపు పగిలి నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న సర్పంచ్ గరులే దీపక్ వెంటనే స్పందించి, బుధవారం పంపును మరమ్మత్తు చేయించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి, యువజన నాయకులు తీగుట్ల రాజ్ కుమార్, గ్రామ సిబ్బంది పాల్గొన్నారు. సర్పంచ్ దీపక్ చొరవతో ప్రజల నీటి సమస్య తీరింది.