ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న ఇన్స్ట్రక్టర్ కంప్యూటర్ టీచర్లను ఐటీడీఏ ఉద్యోగులుగా గుర్తించి, వారి సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కిరణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్లో ఇన్స్ట్రక్టర్ కంప్యూటర్ టీచర్స్ జిల్లా జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఆదివాసీ విద్యార్థులకు సాంకేతిక విద్యను అందిస్తున్నప్పటికీ, ప్రభుత్వం వారి పట్ల చిన్నచూపు చూస్తోందని వారు ఆరోపించారు.