బుధవారం ఆదిలాబాద్ జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. పట్టణంలోని శ్రీ గోపాలకృష్ణ మఠంలో భక్తుల తాకిడి అధికంగా ఉంది. మఠాధిపతి యోగానంద సరస్వతి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు సామూహికంగా కాగడా హారతి వెలిగించి స్వామి వారిని ఆరాధించారు. కార్తీక పౌర్ణమి ప్రాముఖ్యతను మఠాధిపతి వివరించారు.