మావల ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సయ్యద్ ముజాహిద్ నిజామాబాద్ టూటౌన్కు బదిలీ అయ్యారు. ఈ మేరకు శుక్రవారం మావల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్సై ముజాహిద్ను డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐ స్వామి, సిబ్బందితో కలిసి ఆయనను ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. ఎస్సైగా మండలంలో ఆయన చేసిన సేవలు అభినందనీయమని డీఎస్పీ పేర్కొన్నారు.