శుక్రవారం, సనాతన హిందూ ఉత్సవ సమితి సభ్యులు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్ లను వారి కార్యాలయాల్లో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. సమితి చేపడుతున్న కార్యక్రమాల పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖత్రి, సభ్యులు బండారి వామన్, రేణికుంట రవీందర్, కందుల రవీందర్, సుభాష్, నర్సింల, స్వామీ, రాజు పాల్గొన్నారు.