మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల కమిషన్ నిర్దేశించిన ఖర్చుల పరిమితిని పాటించాలని, నిబంధనలను తెలుసుకోవాలని ఎన్నికల జిల్లా అబ్జర్వర్ హన్మంత్ నాయక్ సూచించారు. గెలిచిన తర్వాత కూడా ఖర్చుల వివరాలను సమర్పించాల్సి ఉంటుందని, పరిమితికి మించి ఖర్చు చేస్తే అనర్హత వేటు పడే అవకాశాలున్నాయని ఆయన హెచ్చరించారు.