మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ మున్సిపాలిటీ బీజేపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా సాయితేజ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం నిర్వహిస్తానని సాయితేజ తెలిపారు. తన నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే పాయల శంకర్, జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, కన్వీనర్ సుమీరన్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.