ఆదిలాబాద్: ఘోరం..నీటి గుంతలో పడి అక్కతమ్ముడు మృతి

56చూసినవారు
నీటి గుంతలో ప్రమాదవశాత్తు పడి అక్క, తమ్ముడు మృతి చెందిన ఘటన శనివారం మావలలో చోటు చేసుకుంది. మావల కు చెందిన స్వామి కొడుకు విధాత ( 9), కూతురు వినూత్న (11) గ్రీన్ సిటీ సమీపంలోని సైకిల్ మీద వెళుతుంటే ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి మృతి చెందారు. వారి మృతదేహాలను నీటి కుంటలో నుండి బయటకు తీసి రిమ్స్ మార్చురీకి తరలించారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్