ఆదిలాబాద్ మైనార్టీ గురుకుల బాలికల కళాశాల-2లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ, విద్యతోనే సామాజిక వికాసం సాధ్యమని, మైనార్టీ విద్యార్థినులు చదువులో రాణిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించడం గర్వకారణమని అన్నారు. ప్రభుత్వ గురుకులాల్లో కల్పిస్తున్న అత్యాధునిక వసతులను, నాణ్యమైన విద్యా బోధనను విద్యార్థినులు పూర్తిస్థాయిలో వినియోగించుకుని తమ లక్ష్యాలను చేరుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.