ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ, కార్తీక మాసంలో ఆధ్యాత్మిక శోభ పెరుగుతుందని, ముఖ్యంగా కాగడ హారతికి ప్రాముఖ్యత ఉంటుందని తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన కాగడ హారతి వేడుకల్లో ఎమ్మెల్యే దంపతులు పాల్గొన్నారు. మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి స్వామి ఆధ్వర్యంలో స్వామివారికి ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.