ప్రభుత్వ పాఠశాలలకు వేసవిలో విద్యార్థులను చేర్పిస్తే ఆ ఉపాధ్యాయులకు పాయింట్లు ఇస్తామన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సోమయ్య డిమాండ్ చేశారు. ఆదివారం ఆదిలాబాద్లోని డీటీఎఫ్ జిల్లా వార్షిక కౌన్సిల్ సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య క్రమం తగ్గడానికి కారణాలను శాస్త్రీయంగా పరిశీలించి పరిష్కారం కనుగొనాలన్నారు.