ఆదిలాబాద్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని, ప్రజలకు అవసరమైన మేర నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. అదనపు కలెక్టర్, చమురు కంపెనీల సేల్స్ అధికారులు, బంక్ డీలర్లు, సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. జిల్లాలో ఇంధన సరఫరా సజావుగా సాగేలా అన్ని చర్యలు తీసుకున్నామని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు.