ఆదివాసీ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇంద్రవెల్లి అమర వీరుల స్తూపం వద్ద ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో బుధవారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. ఏజెన్సీ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని నేతలు కోరారు. ఎస్టీ జాబితా నుండి వలస లంబాడాలను తొలగించాలని వారు డిమాండ్ చేశారు.