ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో గుర్తు తెలియని అరవై ఏళ్ల వృద్ధుడు మృతి చెందారు. వైద్యుల కథనం ప్రకారం గత నెల 28న ఆసుపత్రిలో చేరిన ఆయన శనివారం ఉదయం మృతి చెందారు. మృతదేహాన్ని ప్రస్తుతం శవాగారంలో భద్రపరిచినట్లు ఆర్ఎంఓ తొడ్సం చందు తెలిపారు. అతని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.