జైనథ్ లో పనిచేస్తున్న ఉపాధిహామీ కూలీలను ఆదిలాబాద్
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి ఆదివారం నాడు కలిశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన, పని ప్రదేశం నుండి ఆర్టీసీ బస్సు ఆపడం లేదన్న కూలీల సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కూలీలు చేస్తున్న పనులను కూడా ఆయన పరిశీలించారు.