ఇచ్చోడ మండలంలోని కోకస మన్నూర్ గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గత కొంతకాలంగా మతిస్థిమితం కోల్పోయిన ఆమె, మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగింది. అదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందినట్లు ఇచ్చోడ ఎస్ఐ నరేష్ కుమార్ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.