నార్నూర్ మండలంలోని ఉమ్రి గ్రామంలో జాదవ్ నరేష్ (18) అనే యువకుడు వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. జైనూర్ మండలం అందుగూడకు చెందిన సునీత, అన్నాజీ దంపతుల కుమారుడైన నరేష్, నాలుగేళ్లుగా పాలేరుగా పని చేస్తున్నాడు. సోమవారం సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా ఈ విషాదం వెలుగులోకి వచ్చింది. ఏఎస్సై గణపతి ఈ వివరాలను తెలిపారు.