బెల్లంపల్లి - Bellampalli

ఎన్నికల నియమావళిపై అభ్యర్థులకు అవగాహన కల్పించిన అధికారులు

ఎన్నికల నియమావళిపై అభ్యర్థులకు అవగాహన కల్పించిన అధికారులు

కాసిపేట మండలంలో ఈనెల 14న జరగనున్న రెండవ విడత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నియమావళిపై అభ్యర్థులకు అవగాహన కల్పించారు. ఎంపీడీవో సత్యనారాయణ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి, తాసిల్దార్ సునీల్ కుమార్, ఎంపిఓ షేక్ సఫ్దర్ అలీ, ఎన్నికల పర్యవేక్షణ అధికారి పాల్గొన్నారు. ఎన్నికలు సజావుగా, శాంతియుతంగా జరిగేలా కృషి చేయాలని, ప్రవర్తన నియామావళిని పాటించాలని సూచించారు. అభ్యర్థుల బాధ్యతలు, ప్రచార పరిమితులు, వాహనాలు, మైక్ అనుమతులు వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఎటువంటి ఉల్లంఘనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దేవాపూర్, కాసిపేట ఎస్ఐలు, ఆయా గ్రామాల సర్పంచ్, వార్డు అభ్యర్థులు పాల్గొన్నారు.

వీడియోలు


మంచిర్యాల జిల్లా
పంచాయతీ ఎన్నికలు.. ప్రత్యర్థి ఓటును పక్క ఊరికి బదిలీ చేయించిన అభ్యర్థి
Dec 08, 2025, 15:12 IST/

పంచాయతీ ఎన్నికలు.. ప్రత్యర్థి ఓటును పక్క ఊరికి బదిలీ చేయించిన అభ్యర్థి

Dec 08, 2025, 15:12 IST
TG: ఓ వ్యక్తి తన ప్రత్యర్థి ఓటును పక్క ఊరికి బదిలీ చేయించిన ఘటన రంగారెడ్డి(D) ఫరూక్ నగర్ (M)లో తాజాగా వెలుగుచూసింది. కంసాన్పల్లికి చెందిన సలీమ్ అనే వ్యక్తి పంచాయితీ ఎన్నికల్లో వార్డ్ అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్నాడు. ఎన్నికల నోటిఫికేషన్ రాగానే ఓటర్ జాబితాను పరిశీలించగా తన పేరు లేదు. దీంతో అధికారులను సంప్రదించాడు. తన ఓటు పక్క ఊరికి బదిలీ అయిందని తెలిసి కంగుతిన్నాడు. దీనిపై ఆరా తీయగా తన ప్రత్యర్థిగా నామినేషన్ వేసిన అంజాద్ అనే వ్యక్తి కారణమని తెలుసుకుని అధికారులు ఫిర్యాదు చేశారు.