బజార్హత్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్యంపేట కాలనీలో వడ్డెర కమ్యూనిటీకి చెందిన రెండు వర్గాల మధ్య జరిగిన గొడవను ఆపడానికి వెళ్లిన పోలీసులపై ఇత్తారి రాజేష్, ధారంగుల దుర్గేష్ అనే ఇద్దరు వ్యక్తులు దాడి చేసి, చంపేస్తామని బెదిరించారు. ఈ ఘటన ఈనెల 24న చోటుచేసుకుంది. పోలీసులు వీరిపై కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. ఎస్సై రమేష్ ఈ వివరాలను తెలిపారు.