Mar 14, 2026, 14:03 IST/ఆదిలాబాద్
ఆదిలాబాద్
ఓటరు జాబితా ప్రత్యేక సవరణపై జిల్లా కలెక్టర్ సమీక్ష
Mar 14, 2026, 14:03 IST
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా జిల్లాలో ఓటరు మ్యాపింగ్ శాతాన్ని పెంచేందుకు రాజకీయ పార్టీలు, క్షేత్రస్థాయి అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. ఆదిలాబాద్ అర్బన్, మావల మండలాల బి. ఎల్. ఓలు, సూపర్వైజర్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో మ్యాపింగ్ పురోగతిపై ఆయన సమీక్షాసమావేశం నిర్వహించారు. 2002 నాటి ఓటరు జాబితా, ప్రస్తుత జాబితాను పోల్చి చూస్తూ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. 30 శాతం కంటే తక్కువ మ్యాపింగ్ ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.