పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో ఖతార్లోని భారత ఎంబసీ కీలక అడ్వైజరీ జారీ చేసింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 7 వరకు ఖతార్ నుంచి బయలుదేరే విమానాలు రద్దు చేయబడ్డాయి. ప్రస్తుతం ఖతార్లో పర్యాటకులు/స్వల్పకాలిక సందర్శకులుగా చిక్కుకుపోయిన భారతీయ పౌరుల కోసం దోహాలోని ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ విడుదల చేసింది.