ఉత్తరప్రదేశ్లోని బులంద్హర్లో ముబీన్ అనే వ్యక్తి తన 50 ఏళ్ల తండ్రిని, 21 ఏళ్ల భార్యను పిస్టోల్తో కాల్చి చంపాడు. వారిద్దరి మధ్య ఉన్న వివాహేతర సంబంధాన్ని తెలుసుకున్న ముబీన్, వారి వాట్సాప్ చాట్లను చదివి మరింత కోపోద్రికుడయ్యాడు. ఈ క్రమంలో ఇటీవల వారిని అభ్యంతరకర స్థితిలో చూసి తట్టుకోలేక పిస్టోల్తో మొదట తండ్రిని, తర్వాత భార్యను కాల్చి చంపాడని పోలీసులు తెలిపారు.