భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, అఫ్గాన్ విదేశాంగ మంత్రి ముత్తాఖీతో భేటీ సందర్భంగా పాకిస్తాన్కు స్పష్టమైన సందేశాన్ని పంపారు. అఫ్గానిస్థాన్ భారత్కు సమీప పొరుగు దేశమని, అక్కడి ప్రజలకు భారత్ శ్రేయోభిలాషి అని పేర్కొన్నారు. ఇరు దేశాలు సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్నాయని, దీనిపై సంయుక్త పోరు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ను పరోక్షంగా ప్రస్తావిస్తూ, జమ్మూకశ్మీర్లో పాక్ ఆక్రమణపై ఆయన స్పందించారు. ఈ సమావేశం జరుగుతున్న సమయంలోనే కాబుల్లో పాకిస్తాన్ వాయుసేన దాడులు జరపడం గమనార్హం.