అహ్మదాబాద్ విమాన ప్రయాణం.. కన్నీళ్లు పెట్టిస్తున్న వృద్ధ దంపతుల స్టోరీ

1489చూసినవారు
అహ్మదాబాద్ విమాన ప్రయాణం.. కన్నీళ్లు పెట్టిస్తున్న వృద్ధ దంపతుల స్టోరీ
గత ఏడాది ఇదే రోజున, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో ఖేడాకు చెందిన వృద్ధ దంపతులు రజినీకాంత్, పుష్ప బెన్ దర్జీ ప్రాణాలు కోల్పోయారు. ఇంగ్లాండ్‌లో ఉన్న తమ కుమారుడిని కలవడానికి విమానం ఎక్కిన వీరిద్దరూ, కొడుకును చూడకుండానే మరణించారు. బీజే కాలేజీలో డాక్టర్ చదివిన వీరి కుమారుడు, తల్లిదండ్రులను ఇంగ్లాండ్‌కు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశాడు. కొడుకును చూసేందుకు జూన్ 12న మొదటిసారి విమానం ఎక్కిన ఈ దంపతులు, కొడుకు చదివిన అదే కాలేజీ హాస్టల్‌పై విమానం కుప్పకూలడంతో సజీవదహనమయ్యారు.

సంబంధిత పోస్ట్