ఇండోనేషియాలోని బాలీలో విశ్రాంతి తీసుకుంటున్న 40 ఏళ్ల ఎయిరిండియా పైలట్ తీవ్ర గుండెపోటుతో మరణించారు. న్యూఢిల్లీ నుండి బాలికి అంతర్జాతీయ విమానానికి పైలట్గా వ్యవహరించిన ఆయన, డ్యూటీ అనంతరం హోటల్లో ఉండగా అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఇటీవలే వైద్య పరీక్షల్లో ఆరోగ్యంగానే ఉన్నట్లు తేలినప్పటికీ ఈ విషాదం చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.