13 ఏళ్ల తర్వాత రన్ వేపై ప్రత్యక్షమైన ఎయిర్ ఇండియా విమానం

13017చూసినవారు
13 ఏళ్ల తర్వాత రన్ వేపై ప్రత్యక్షమైన ఎయిర్ ఇండియా విమానం
కోల్‌కతా విమానాశ్రయం రన్ వే హాంగర్‌లో 13 ఏళ్ల క్రితం రికార్డుల నుంచి మాయమైన ఎయిర్ ఇండియా బోయింగ్ 737-200 విమానం బయటపడింది. 43 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ విమానాన్ని ఇంజనీర్ల శిక్షణ కోసం ఇంజిన్‌తో సహా బెంగళూరు తరలించారు. ప్రైవేటీకరణ సమయంలో రికార్డుల నుంచి మర్చిపోవడం వల్లే ఈ విమానం కనిపించకుండా పోయిందని ఎయిర్ ఇండియా సీఈవో కాంప్‌బెల్ విల్సన్ తెలిపారు. 1982లో ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో చేరిన ఈ విమానం, పలు మార్పుల తర్వాత 2012లో రిటైర్ అయింది.

సంబంధిత పోస్ట్