దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విశాఖపట్నం–విజయవాడ రూట్లో ఆధునికీకరణ పనులను నిర్వహిస్తున్నారు. జనవరి 27 నుంచి 31 వరకు మొత్తం 16 రైళ్లను రద్దు చేయనున్నారు. ఈస్టకోస్ట్ రైల్వే ప్రయాణికులు ప్రణాళికలు మార్చుకోవాలని సూచించింది. విజయవాడ–విశాఖ, గుంటూరు–విశాఖ, లింగంపల్లి–విశాఖ, తిరుపతి–పూరి సహా పలు రైళ్లు తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు.