తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో రాబోయే 1-2 గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని APSDMA తెలిపింది. తెలంగాణలోని భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఉరుములతో కూడిన వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.