షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ ప్రీమియర్లో అంబానీ ఫ్యామిలీ సందడి చేసింది. ముకేశ్ అంబానీ, నీతా అంబానీ కలిసి వచ్చారు. ఆ తర్వాత ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతా, రాధికా మర్చంట్ వచ్చి ఫొటోలను ఫోజులిచ్చారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ ప్రీమియర్ అనంతరం సెలబ్రిటీలు ఆర్యన్పై ప్రశంసలు కురిపించారు.