కర్ణాటకలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బెంగళూరు రిచ్మండ్ సర్కిల్ వద్ద అంబులెన్స్ బీభత్సం సృష్టించింది. సిగ్నల్ వద్ద ఆగి ఉన్న బైక్లను అంబులెన్స్ ఢీకొట్టింది. ఘటనా స్థలంలోనే ఇస్మాయిల్, సమీన్ బాను దంపతులు మృతి చెందారు. ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. స్థానికులు ఆగ్రహానికి లోనై అంబులెన్స్ను ఎత్తిపడేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.