పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి.
అమెరికా మరోసారి ఇరాన్పై దాడికి దిగింది. బందర్ అబ్బాస్లోని సైనిక స్థావరంపై క్షిపణులను ప్రయోగించింది. ఈ క్రమంలో నాలుగు ఇరాన్ అటాక్ డ్రోన్లను
అమెరికా కూల్చివేసింది. దీనికి ప్రతిస్పందనగా కువైట్లోని
అమెరికా స్థావరంపై ఇరాన్ ప్రతీకార దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాలు ప్రాంతంలో మరింత అస్థిరతకు దారితీసే అవకాశం ఉంది.