మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మాను నవంబర్ 30లోపు ఎన్కౌంటర్ చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా భద్రతా బలగాలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఇటీవల జరిగిన కీలక రివ్యూ సమావేశంలో హిడ్మా కదలికలు, అతని ప్రభావం, ఆపరేషన్ల పురోగతిపై విస్తృతంగా చర్చించారని అధికార వర్గాలు వెల్లడించాయి. హిడ్మా దాడులతో ప్రభావిత ప్రాంతాల్లో కూంబింగ్ చర్యలను పెంచాలని కూడా అమిత్ షా సూచించినట్లు తెలుస్తోంది.