అడవిలో మావోయిస్టులతో కలిసి భోజనం చేసిన ఎస్సై

74చూసినవారు
అడవిలో మావోయిస్టులతో కలిసి భోజనం చేసిన ఎస్సై
ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ జిల్లాలో ఆదివారం, ముగ్గురు మావోయిస్టులు లొంగిపోవడానికి వస్తున్నారనే సమాచారంతో పార్తాపూర్‌ ఎస్సై రామేశ్వర్‌ చతుర్వేది స్వయంగా అడవులకు వెళ్లి వారిని స్వీకరించారు. దండకారణ్యంలో కాలినడకన వస్తున్న మావోయిస్టులకు ఆహారం లేదని తెలుసుకుని, వారికి భోజన ఏర్పాట్లు చేసి, వారితో కలిసి అడవిలో భోజనం చేశారు. పార్తాపూర్‌ ఏరియా కమిటీకి చెందిన రాధిక కుంజం, సందీప్‌ కడియం, రైను పద్మ తమ ఆయుధాలతో లొంగిపోయారు.

సంబంధిత పోస్ట్