దర్శకుడు అనిల్ రావిపూడి తన 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంతో భారీ విజయం సాధించిన నేపథ్యంలో, ఆయన తదుపరి చిత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉండబోతుందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో పవన్ లెక్చరర్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. కేవలం 70 రోజుల్లోనే సినిమా పూర్తి చేస్తానని అనిల్ రావిపూడి మాట ఇచ్చారని, ఆయన చెప్పిన కథను పవన్ మెచ్చుకున్నారని తెలుస్తోంది.